నర్మదా నది గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. లయకారకుడైన శివుడు ఒకసారి తాండవం చేస్తుండగా ఆయన శరీరమంతా స్వేదంతో నిండిపోయిందట. అందులోని ఒక బిందువు నేలను చేరి అది నర్మదానదిగా ప్రవహించిందని ఒక కథ ప్రచారంలో ఉంది.
మరొక కథ...
సృష్టి కారకుడైన చతుర్ముఖబ్రహ్మ కంటి నుంచి రెండు కన్నీటిచుక్కలు రాలాయట. అవి నర్మద, సూర్య నదులుగా ప్రవహించాయని చెబుతారు.